తాళ్లూరు మండలంలోని నాగంబొట్లపాలెం సహకార సొసైటీ చైర్మన్ గా తూర్పు గంగవరానికి చెందిన యాడిక యలమందారెడ్డిని నియమిస్తూ జిల్లా సహకార శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న త్రిసభ్య కమిటీ గడువు గత నెలాఖరుతో ముగియడంతో నియామకాలు చేపట్టారు. ప్రస్తుతం సభ్యులుగా ఉన్న బొద్దికూరపాడుకు చెందిన పులి అంజిరెడ్డి, తూర్పు గంగవరానికి చెందిన గుజ్జుల బ్రహ్మారెడ్డిలను మరలా కొనసాగించారు. సొసైటీ చైర్మన్ తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొదటి శెట్టి వేణుగోపాల్ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్ది శెట్టి రవీంద్ర కు, సహకరించిన స్థానిక ప్రజాప్రతినిధులు సొసైటీ చైర్మన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
