దర్శి పట్టణం లోని పలు పాఠశాలకు వైస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి పాఠశాలల కు అవసరమైన వస్తువులను అందచేశారు. వైస్ ఎం.పి. పి దుర్గా రెడ్డి రమాదేవి ల వివాహ వార్షికోత్సవ ము సందర్భం గా భవిత పాఠశాలకు కుర్చీలు, ఫ్యాన్ లు అందచేశారు. చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి చిన్నారులకు పంచి పెట్టారు. అదే విధంగా నగర పంచాయతీ పరిధిలో ని పాముల కాలనీ, గొర్లగడ్డ లోని అంగన్వాడీ కేంద్రలకు కూడా కుర్చీలు, ఫ్యాన్ లు అందచేశారు. ఎం. పి. పి సోము దుర్గా రెడ్డి దంపతుల సేవలను పలువురు కొనియాడారు.

