సమస్యలను లోతుగాఓ అధ్యయనం చేసి నూతనం ఆలోచించి ప్రజలకు సరియైన సులభమైన పరిష్కారం అందించటంలో విద్యార్థులు ఆలోచించి సమాజానికి ఉపయోగపడాలని వక్తలు అన్నారు. స్థానిక పేస్ కళాశాలలో మంగళవారం స్మార్ట్ ఇండియా హ్యాక్ థాన్(ఇంటర్నల్ హ్యాక్ థాన్) కార్యక్రమం హ్యాక్ థాన్ కోఆర్డినేటర్ అండ్ ఇన్నోవేషన్ అంబాసిడార్ ఎం. జానకీ రాం ఆధ్వర్యంలో నిర్వహించారు. జ్యూరి కమిటీ మెంబర్, ప్రిన్సిపాల్ డాక్టర్ జవికే మూర్తి మాట్లాడుతూ భారత దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాక్ థాన్ కార్యక్రమంలో పేస్ కళాశాల బాగస్వామ్యం అవుతూ విద్యార్థులను దేశ సమస్యలపై వినూత్నమైన ఆవిష్కరణలు చేయుటకు నాంది పలుకుతున్నట్లు చెప్పారు. సమస్యలు లోతుగా పరిశీలించి, పరిష్కారాలను ఆలోచించటం. ప్రజలకు సరియన. సులభమైన పరిష్కారాలు అందించలం, కొత్తదనం ఉట్టిపడేలా విద్యార్థులకు ప్రోత్సహించటం ఈ కార్యక్రమం ముఖ్యు ఉద్దేశ్యమని డీన్ ఆఫ్ అకడమిక్స్ డాక్టర్ అప్పారావు అన్నారు.
