పెస్ కళాశాలలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్
ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు పీసీబి రూపకల్పనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్టీ అండ్ సీఎస్ సంస్థ ప్రతినిథులు డాక్టర్ ఎస్. వి నరేష్,ప్రభుకుమార్, రత్నకుమారి, లక్ష్మి, భాజాలు గత వారం రోజులుగా విద్యార్థులకు జరుగుతున్న వర్క్ షాప్ లో పాల్గొని విద్యార్థులకు పీసీబి తయారీపై అవగాహన కల్పించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్, ప్రిన్సిపాల్ డాక్టర్ జివికే మూర్తి, ఇసిఈ విభాగపు అధిపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

