ఒంగోలు మాంటిస్సోరీ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన దసరా వేడుకలు ఆకట్టుకున్నాయి. అమ్మవారి తొమ్మిది అవతారాలతో ప్రైమరీ విద్యార్థులవేషదారణ ఆకట్టుకున్నది.
కోలాటం, బతుకమ్మ, బాలుర నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు పండుగ ప్రాధాన్యతను చాటిచెప్పారు.
మంచిపై చెడు విజయమే విజయదశమి అని కరస్పాండెంట్ శబరినాథ్ అన్నారు. ప్రిన్సిపాల్ నురుద్దీన్, వైస్ ప్రిన్సిపాల్ నరేష్ బాబు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.



