దేశం గర్వించ దగిన వ్యక్తిగా ఎదిగి, రాష్ట్రపతి పదవిని అధిరోహించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయుడని ఏఎస్ఐ మోహనరావు అన్నారు. కలాం జయంతి సందర్భంగా తాళ్లూరు లో వెల్లంపల్లి రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్య క్రమంలో వైసీపీ జిల్లా ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి కూకట్లవీర బ్రహ్మం, లక్కవరం వైఎస్ఆర్సిపి నేత నన్నం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
