విద్యుత్ వైర్ల పై చెట్టు, ప్రాణాలు తీసేందుకు రెడీ అనే వార్తకు దర్శి నగర పంచాయతీ అధికారులు వెంటనే స్పందించారు. దర్శి లోని గంగవరం రోడ్డులోని మసీదు వద్దగల చెట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని విద్యుత్ వైర్లపై ఉన్న చెట్టును పరిశీలించి తొలగించారు. కమిషనర్ వెంటనే స్పందించిన తీరుతో స్థానికులు కమిషనర్ మహేష్ స్పందనకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
