నిరుపేదల జీవన ప్రమాణాలు పెంచటమే అసలైన అభివృద్ధి అని నమ్మి సంక్షేమ పథకాలను పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగనన్నను ముఖ్యమంత్రిగా, వాసన్నను ఎమ్మెల్యేగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా చేసుకుందామని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. 48వ డివిజన్లో డివిజన్ పరథిలో సత్యనారాయణపురం, చంద్రయ్య నగర్ తదితర వీధులలో వైఎస్సార్సీపీ డివిజన్ ఇన్చార్జిలు శేషిరెడ్డి, కోఆర్డినేటర్ నరేంద్ర రెడ్డి, డివిజన్ ఆధ్యక్షుడు వీర భద్రరావు (వీరు) ఉన్నం జనార్ధన్, మాధవ, హనుమా, నాగరాజు, బాదులు, వెంకటేష్, రాము, మధు, నాగేశ్వరావు, సుధాకర్, రాఘవయ్య, జాణా శ్రీను, గురువా రెడ్డి, స్టీఫెన్, జానీ, చిరంజీవి, కొప్పొలు వెంకటేశ్వర్లు, జ్యోతి, మాధవి, మల్లెశ్వరి, ఉషా, శేషమ్మ, వాకా బ్రహ్మా రెడ్డి, రామక్రిష్ణా రెడ్డి, సత్తి రెడ్డి తదితరులు తిరిగి కోవిడ్ సమయంలో ఎవరూ ఆదుకోని సమయంలో డిబీటి ద్వారా ప్రభుత్వం ఆదుకుందని, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేసారని గుర్తు చేసారు. తిరిగి ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా చెవి రెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
