వాహనాలు నడిపే సమయంలో చోదకులు కచ్చితంగా శిర స్త్రాణం ( హెల్మెట్) ధరించాలని ఎంవీఐ రవికుమార్ కోరారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పొదిలిరోడ్డులోని రవాణా శాఖ కార్యాలయం నుంచి గడియార స్తంభం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఎం వి ఐ రవికుమార్ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిం చాలని, సెల్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.
