ఎన్నికల ముందు తాను ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యతా క్రమంలో అమలయ్యేలా చూస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు.
శుక్రవారం నియోజక వర్గం పరిధిలోని వార్డు 2 రసూల్ పూర సిల్వర్ కంపెనీ, నారాయణ జోపిడి ప్రాంతంలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు..
అనంతరం శ్రీగణేష్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను విడుతల వారీగా నెరవేరుస్తానన్నారు.తనపై నమ్మకంతో గెలిపించినందుకు, నాకు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ల సహకారంతో
దబుల్ ఇండ్ల లో పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్దిదారులకు కేటాయింపులు చేస్తాం అని తెలిపారు… ఈ కార్యక్రమంలో బద్రి యాదవ్ నయీం, మల్లేష్,.యాదగిరి,సంతోష్ యాదవ్,.రమేష్,నగేష్,రాజు, ప్రభాకర్,నరసయ్య, సుధాకర్,వెంకటేష్,బాల్రాజ్,గోపి,యాదగిరి,నయీం, వహబ్,జరియాన, షమ్మి, నాసర్,గఫార్,చాంద్,భాష,సలీం, తదితరులు పాల్గొన్నారు.

