ప్రకాశం జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతుల జీవితాల్లో పెను కష్టాలు మిగిలించాయని ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కైపు వెంకట కృష్ణా రెడ్డి అన్నారు . వర్షాలతో పంటలు నాశనం అవ్వడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని .. ముఖ్యంగా వరి, పత్తి, మిరప, టమోటా వంటి విలువైన పంటలు దెబ్బతిన్నాయ ని తెలిపారు . ఈ వర్షాలు కేవలం పంటలకు మాత్రమే కాకుండా, ప్రజల జీవితాలకు కూడా దెబ్బతీశాయ ని అన్నారు . గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ కార్మికులు తమ భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళన చెందుతున్నట్లు ఆందోళన చెందారు .
అకస్మాత్తుగా వచ్చిన ఈ వర్షాలు వలన పంటలను నేలమట్టం అయి , రైతుల పొలాల్లోని పంటలు మొత్తం కోల్పోయే పరిస్థితి వచ్చిందని , అలాగే రహదారులు కూడా భారీగా దెబ్బతిన్నాయని … వర్షపు నీటితో రహదారులు పూర్తిగా నాశనం కావడం వల్ల, ప్రజలు రవాణా పై తీవ్ర మైన ప్రభావం చూపు తుందని అన్నారు . ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని … పాడైన రోడ్ల వల్ల ప్రజలకు సకాలంలో సహాయం అందించడం కష్టంగా మారింద ని అన్నారు .
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంద ని అన్నారు . పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేసారు . రైతులకు భరోసా కలిగించేందుకు ప్రత్యేక ఆర్థిక సహాయం కల్పించాలని కోరారు . అలాగే రోడ్లను సత్వరంగా మరమ్మతు చేయించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసారు .
ఈ ప్రకృతి వైపరీత్యాలు రైతులపైనే కాదు, సర్వ సాధారణ ప్రజలపైన కూడా తీవ్ర ప్రభావం చూపాయని అన్నారు . ప్రతి కుటుంబం ఈ కష్టకాలంలో నష్టపోయిందని , ప్రభుత్వం ఈ విపత్తును పట్టించుకుని వెంటనే సహాయ చర్యలు ప్రారంభించాలని, పేద ప్రజలు, రైతులు కష్టాలు పడకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంద ని అన్నారు
