రైతులు వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. మన్నేపల్లి, తురక పాలెం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎవో ప్రసాద రావు మాట్లాడుతూ… మండలంలో 2910 ఎకరాలలో వరి సాగు చేసారని చెప్పారు. వరిలో ప్రధానంగా ఉల్లి కోడు , గొట్టాలు, గొట్టపు రోగం, కాండం తొలుచు పురుగు లేద లెల్ల కంకి ఆకు ముడుత నోము వంటి పలు తెగుళ్లు ఆశించే అవకాశం ఉన్నందున నివారణ చర్యలను సూచించారు. విఏఏ లు నాగ రాజు, బ్రహ్మయ్య, సుధీర్ లు పాల్గొన్నారు.


