జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తుల గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 30తో గడువు ముగియగా మరో 15 రోజులు పొడిగించింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీ టీఈ), విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ద్వారా ఈ పథకాలను అమలు చేస్తోంది. ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్షిప్ కు టెక్ని కల్ డిగ్రీ, డిప్లొమా మొదటి ఏడాది బాలికలుఅర్హులు.
వీరికి ఏడాదికి రూ.50 వేల చొప్పున ఉప కార వేతనం లభిస్తుంది. ఏఐసీటీఈ సాక్షమ్ టెక్ని కల్ డిగ్రీ, డిప్లొమాలో ఏ సంవత్సరంలోనైనా దివ్యాంగులకు ఏడాదికి రూ.50 వేలు అందుతుంది. ఏఐసీటీఈ స్వాంతన్ కింద తల్లిదండ్రులు చనిపో యిన అనాథలకు ఏ సంవత్సరంలోనైనా రూ.50 వేలు లభిస్తుంది. యూజీసీ పోస్టుగ్రాడ్యుయేట్స్ కు మొదటి ఏడాది చదువుతున్నవారు అర్హులు. వీరు ఉపకార వేతనానికి ఎంపికైతే నెలకు రూ.10 వేల చొప్పున 15 నెలలు చెల్లిస్తుంది.