కళాసిగూడలో నెలకొన్న సమస్యలను c, పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బుధవారం బేగంపేట డివిజన్ పరిధిలోని కళాసిగూడ లో గల మినర్వ కాంప్లెక్స్ డౌన్ లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదని, కలుషిత త్రాగునీటి సరఫరా జరుగుతుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా డ్రైనేజీ ఓవర్ ఫ్లో జరిగి మురుగునీరు రోడ్లపై ప్రవహహించి ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ త్రాగునీటి పైప్ లైన్ ఎక్కడ లీకేజీ ఉందో గుర్తించి కలుషిత నీటి సరఫరా ను నియంత్రించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా డ్రైనేజీ ఓవర్ ఫ్లో సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్ట్రీట్ లైట్ లు లేవని, రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరగా, వెంటనే స్ట్రీట్ లైట్ ల ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు అందజేయాలని అన్నారు. ఎమ్మెల్యే వెంట డీ సి సమ్మయ్య, కార్పొరేటర్ టి.మహేశ్వరి, వాటర్ వర్క్స్ డి జీ ఎం శశాంక్, ఈ ఈ సుబ్రహ్మణ్యం, టౌన్ ప్లానింగ్ అధికారి సుష్మిత, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బస్తీ వాసులు ప్రమోద్, నర్సింగ్, బి ఆర్ ఎస్ పార్టీ రాంగోపాల్ పేట డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్, శేఖర్, కిషోర్, ఆంజనేయులు, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

