జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని ఆలయం వద్ద దేవదాయ శాఖ ఆధ్వర్యంలో పూజా సామగ్రి విక్రయించే హక్కు కోసం వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఈవో జి వాసు బాబు తెలిపారు. తిరునాళ్లు రెండు రోజులు మినహా యించి 2025 ఎప్రియల్ ఒకటి నుండి 2026 మార్చి 31 వరకు ఈ హక్కులు ఉంటాయని చెప్పారు. ఈనెల 17న బహిరంగ వేలం పాటలు మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటాయని చెప్పారు. కొబ్బరి కాయలు, పూజా ద్రవ్యములు వగైరాలు అమ్ముకొని హక్కు కోసం రూ. 50వేలు, కొప్పల చిప్పల ప్రొగు కోసం రూ. 25వేలు, తిను బండారాలు, హోటల్ నడుపుకునేందుకు రూ. 25 వేలు డిపాడిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చని చెప్పారు.
