బేగంపేట మార్చి 21(జే ఎస్ డి ఎం న్యూస్)
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 298 దరఖాస్తులు అందాయి.
వీటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 43దరఖాస్తులు, విద్యుత్ శాఖకు సంబంధించి 25, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 56, ఇందిరమ్మ ఇండ్లు పథకం కోసం 106 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 88 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ దాక్టర్ జీ. చిన్నా రెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దరఖాస్థులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబందిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను వెంటనే పరిష్కరించారు.
