డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణానికిరూ.17 కోట్లతో ప్రతిపాదనలు – నిధుల మంజూరుకు మంత్రి హామీ- టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెల్లడి -మంత్రి నారా లోకేష్ ను కలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లు

దర్శి ప్రభుత్వ డిగ్రీ క శాశాల నూతన భవనాల నిర్మాణాలకు నిధులు విడుద ల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చినట్టు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. గురువారం మంత్రిని క్యాంపు కార్యాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ కలిశారు. ఈసందర్భంగా దర్శి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజె క్షులను వివరించారు. నాలుగు సంవత్సరాల క్రితం దర్శి లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభమైందని తెలిపారు.
దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని ఒక భవనంలో అరకొర వసతులతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో వసతులు లేక విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దర్శి కురిచేడు రోడ్డులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం ఆరు ఎకరాల భూమి కేటాయించార న్నారు. అక్కడ భవనాలు నిర్మాణానికి రూ.17 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదనల ప్రతులను మంత్రికి అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి లోకే ష్ వీలైనంత త్వరలో నిధులు విడుదల చేస్తానని అంగీకరించినట్లు వారు తెలిపారు.
అదేవిధంగా జాతీయస్థాయి డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం పునర్నిర్మాణం, అన్నా క్యాంటిన్ నిర్వాహణకు నిధులు విడుదల చేయాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చుతామని మంత్రి భరోసా ఇ చ్చినట్లు వారు తెలిపారు. అందర్ని కలుపుకొని సమిష్టిగా ముందుకు పోవాలని మంత్రి లోకేష్ సూచించినట్టు డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో అర్హులందరికీ అందేలా కృషిచేయాలని సూచించారని ఆమె తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *