ఫ్లాష్….ఫ్లాష్….*

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆధ్వర్యంలో కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివ్రుద్ధి శాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రదాన్ ను కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు………

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

న్యూఢిల్లీ ఏప్రిల్ 1(జే ఎస్ డి ఎం న్యూస్):
కంచె గచ్చిబౌలి భూముల విషయం లో జోక్యం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి బండి సంజయ్ ల ఆధ్వర్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఎం పి లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ లతో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరిన ఎంపీలు హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరం అన్నారు.
700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా అలరారుతోంది
ఈ భూములను రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు..హెచ్ సీయూ విద్యార్థులతోపాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీలు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కోరారు.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *