బిసి., ఈబీసీ మరియు కాపు యాక్షన్ ప్లాన్ కింద బ్యాంకులకు కేటాయించిన
లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేసి ఆయా వర్గాల ప్రజల అభ్యున్నతికి తమ వంతు ఆర్థిక తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా బ్యాంకర్లను కోరారు. గురువారం ఉదయం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, బిసి కార్పోరేషన్ అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులతో సమావేశమై, బిసి కార్పోరేషన్ ద్వారా బిసి మరియు రెడ్డి, క్షత్రియ, కమ్మ, ఈబిసి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు వర్గాలకు స్వయం ఉపాధి పధకాల కింద మంజూరు చేసిన వివిధ యూనిట్స్ గ్రౌండింగ్ పురోగతి పై సమీక్షించి పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….జిల్లాలో బిసి మరియు రెడ్డి, క్షత్రియ, కమ్మ, ఈబిసి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు వర్గాలకు స్వయం ఉపాధి పధకాల కింద 1,864 యూనిట్స్ మంజూరుకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా లోని వివిధ బ్యాంకులకు పంపడం జరిగిందన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈ నెల 9వ తేదీ లోపు సుమారు వెయ్యి యూనిట్స్ గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, బ్యాంకర్ల ను ఆదేశించారు. ఈ నెల 11వ తేదీన జరిగే మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి రోజున సంబంధిత లబ్దిదారులకు యూనిట్స్ మంజూరు ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, బిసి కార్పోరేషన్ అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లు తమకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేసిన ఆయా పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి తమ వంతు సహకారం అందించాలన్నారు. ప్రతిబ్యాంకుకు ఇచ్చిన లక్ష్యాల మేరకు పథకాలు మంజూరు చేసి, గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో బిసి కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర రావు, ఎల్.డి.ఎం రమేష్, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.


