మతకలహాలు సృష్టించాలన్నదే వైసీపీ కుట్ర : హోంమంత్రి వంగలపూడి అనిత.గతంలో పింక్ డైమండ్‌పైనా ఇలాగే దుష్ప్రచారం -పాస్టర్ ప్రవీణ్ మృతిపైనా తప్పుడు ప్రచారం -టీటీడీపై బురదజల్లేందుకు నిత్యం విష ప్రచారం.శాంతిభద్రతలకు భంగంకలిగించేందుకు కుయుక్తులు -తిరుపతి లడ్డూ విషయంలో సిట్ విచారణ పూర్తి చేయగానే బాధ్యులపై చర్యలు -మంత్రి మండలి సమావేశం అనంతరం మీడియాతో హోంమంత్రి అనిత.

అమరావతి, ఏప్రిల్, 15; (జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి):
మత కలహాలు సృష్టించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు కుయుక్తులకు దిగుతోందని ఆమె స్పష్టం చేశారు. అందులో భాగంగానే పాస్టర్ ప్రవీణ్ ప్రమాదంలో మృతి చెందినా హత్యగా చిత్రీకరించేందుకు తప్పుడు ప్రచారం చేశారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై బురదజల్లేందుకు నిత్యం విషప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో పింక్ డైమండ్‌పైనా ఇలాగే దుష్ప్రచారం చేసిన విషయాన్ని హోంమంత్రి అనిత ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్వయంగా పింక్ డైమండ్‌ లేదని తేల్చి చెప్పినా విషప్రచారం చేశారని హోంమంత్రి పేర్కొన్నారు. ఇటీవల నరసన్నపేటలోని ఆలయ సమీపంలో జీసస్ వాక్యాలు రాయించడం.చర్చి దగ్గర జై శ్రీరామ్ అని రాయించడం వైసీపీ కుట్రే అన్నారు.తిరుమల అనేది పవిత్ర స్థలం.సున్నితమైన అంశమైనందున వైఎస్ఆర్సీపీ నాయకులు టీటీడీ కేంద్రంగా విషప్రచారాలుచేస్తున్నారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా గతంలో పనిచేసిన వ్యక్తి అయి ఉండి కూడా రాజకీయాలు చేస్తుండడం దుర్మార్గమన్నారు. టీటీడీ, గోశాలపై ఈవో శ్యామలారావు నిజాలు వెల్లడించారన్నారు. టీటీడీపై బురదజల్లి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ప్రయత్నాలుసాగనివ్వబోమన్నారు. తిరుపతి లడ్డూ విషయంలో సిట్ విచారణ పూర్తి చేస్తామన్నారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరు..శిక్ష అనుభవించక తప్పదని హోంమంత్రి తెలిపారు. అనంతపురం హెలికాప్టర్ ఘటనపైనా అలాగే అబద్ధాలు చెప్పి అసత్య కథనాలు రాశారని హోంమంత్రి స్పష్టం చేశారు. 1100 మందితో జగన్ మోహన్ రెడ్డికి భద్రత కల్పించామని తాను చెబితే బలగాల మోహరింపు అని సాక్షి రాసిన ఉదంతాన్ని ఉదహరించారు. జగన్ లాంటి ఒక క్రిమినల్ రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుందనడానికి జరుగుతున్న పరిణామాలే నిదర్శనన్నారు. జగన్ గ్యాంగ్ అరాచకాలను ఎదుర్కొని నిజాలుప్రజలముందుంచేందుకుఅప్రమత్తంగాఉన్నామన్నారు ఫ్యాక్షన్, నక్సలైట్ల సమస్యను ప్రక్షాళనచేసినచంద్రబాబునాయుడుకు మతఘర్షణలు అణచడం పెద్ద విషయం కాదని హోంమంత్రి అనిత అన్నారు.షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణను మంత్రి మండలి ఆమోదించినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. సమాన, స్వేచ్ఛ హక్కులు, అవకాశాలను కల్పించమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. రెల్లి కులస్థులకు కూడా ఒక శాతం రిజర్వేషన్ కల్పించినట్లు పేర్కొన్నారు. అన్ని ఉపకులాలకు సమాన అవకాశాలు కల్పించడం కోసం 2011 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త జనాభా లెక్కలు వస్తే తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ హాజరుకాలేకపోవడం అన్నది ఆరోపణ మాత్రమేనని మరోసారి హోంమంత్రి అనిత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. విద్యార్థుల సెల్ ఫోన్‌లను ట్రాక్ చేసి, టవర్ డంప్ తో వాస్తవాలను ఆధారాలతో సహా విశాఖ సీపీ బాగ్చీ తేల్చారన్నారు. ఎక్కడ ఏ నేరం జరిగినా గంటల్లోనే నిందితులను పట్టుకుంటున్నట్లు హోంమంత్రి స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే నేరాలు పెరగలేదని , పైగా టెక్నాలజీ సాయంతో నేరస్తులను పట్టుకునే సమయం చాలా తగ్గిందన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *