మల్కాజ్ గిరి మే 16(జే ఎస్ డి ఎం న్యూస్) :
మల్కాజ్గిరి డివిజన్ సర్దార్ పటేల్ నగర్ లో వర్షపు నీటి నివారణ కోసం దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో చెప్పట్టిన పైప్ లైన్ పనులను శుక్రవారం మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ప్రారంభించారు.తమ సమస్య విని కోరిన వెంటనే నిధులు మాజూరు చేయించిన కార్పొరేటర్ శ్రవణ్ కు బస్తీ వాసులు రాములు, శ్రీకాంత్ మున్నూరు, సాయి పటేల్,సూర్య ప్రకాష్, శ్రీధర్ రెడ్డి, రాజు,సుబ్బారావు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్బంగా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ ప్రభుత్వంతో కొట్లాడి, కొట్లాది రూపాయలతో సర్దార్ పటేల్ నగర్ ను అభివృద్ధి చేశామన్నారు.
అత్యవసరమైన ఏ పనికైనా ఎన్నైనా నిధులు ప్రజల సహకారంతోకేటాయించడానికి సిద్ధమని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు.
ఈ కార్యక్రమం లో జిహెచ్ ఎం సి ఏ. ఈ నవీన్, రమేష్, రాములు, సాయిబాబా, చంద్రయ్య, శ్రీధర్ రెడ్డి, సుబ్బారావు,, రవి,రాజు, రాజేష్, రామ్,
బీజేపీ సీనియర్ నాయకులు సునీల్ యాదవ్,సాయిపటేల్, ప్రవీణ్ యాదవ్,వేణుగోపాల్ యాదవ్, వినోద్ యాదవ్, రవి, గోపాల్ మరియు బస్తీ వాసులు పాల్గొన్నారు.
