బేగంపేట జులై 26(జే ఎస్ డి ఎం న్యూస్):
కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో వైద్యులు దక్షిణాఫ్రికాకు చెందిన 27 సంవత్సరాల యువకుడికి ప్రమాదంలో భుజం ఎముక విరిగిపోయి, భుజం కదపలేని పరిస్థితిలో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన యువకుడికి డోనర్ ఎముక గ్రాఫ్ట్ను ఉపయోగించి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో ఈ అధునాతన భుజం మార్పిడి శస్త్రచికిత్స మొట్టమొదటిది.రోగి భుజం పైభాగపు చేతి ఎముక (ప్రాక్సిమల్ హ్యూమరస్) విరిగిపోవడం మరియు ఎముక పూర్తిగా దెబ్బతింది, దీంతో భుజం కలప లేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి కేసులు ముఖ్యంగా యువ రోగులలో చికిత్స చేయడం చాలా క్లిష్టమైనది. సమగ్రంగా పరిశీలించిన అనంతరం, డాక్టర్ బి. చంద్రశేఖర్ నాయకత్వంలోని నిపుణులైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స వైద్యుల బృందం, ప్రాక్సిమల్ హ్యూమరస్ అలోగ్రాఫ్ట్తో కలిపి రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ చేయాలని నిర్ణయించారు – ఈ ప్రక్రియలో సర్టిఫైడ్ బోన్ బ్యాంక్ ద్వారా పొందిన డోనర్ ఎముక టిష్యూ ద్వారా దెబ్బతిన్న భాగాన్ని పున నిర్మించారు.షోల్డర్ రీప్లేస్మెంట్ లో ఈ ప్రక్రియ చ అరుదైనది మరియు అత్యంత క్లిష్టమైనది. నాలుగు గంటల పాటు జరిగిన శస్త్ర చికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకున్నాడని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ భుజం లో ఎముక లేదా కండరాలు బాగా దెబ్బతిన్నప్పుడు నొప్పిని తగ్గించి భుజం కదలికలను మెరుగుపరచడానికి షోల్డర్ రీప్లేస్మెంట్ ఎంతో ఉపయోగపడుతుందని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ షోల్డర్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.
కిమ్స్-సన్షైన్ హాస్పిటల్లోని సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్, అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలో అగ్రగామిగా కొనసాగుతూ, అత్యంత క్లిష్టమైన కేసులకైనా ప్రపంచ స్థాయి పరిష్కారాలను అందిస్తున్నారు.

