పారదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలోపీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు

పారదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నగదు బదిలీ కార్యక్రమం చీమకుర్తి మండలం నాయుడుపాలెం లో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటుచేసి రైతుల ను వీక్షింపజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని రైతులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు, ఎరువుల సరఫరా మరియు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించబడింది. రైతులకు భారతీయ జన ఉర్వరక పథకం (బిజె యూపీ ) పరిధిలో లభ్యమయ్యే ఎరువులపై విపులంగా వివరించారు.
పారదీప్ ఫాస్ఫేట్స్ సంస్థ ప్రదర్శించిన ఉత్పత్తుల్లో భారత్ టీఎస్‌పీ, భారత్ ఎన్ 20-20-0-13, జిప్మైట్ ప్లస్, నానో శక్తి డీఏపీ, బయో 20, ఇంపాక్ట్ వంటి విశిష్ట ఎరువులు ఉన్నాయి. రైతులు ఈ ఉత్పత్తులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులుగా మార్కెటింగ్ ఆఫీసర్ పి. ప్రభాకర్, జె.కె.ఎస్. హరికృష్ణ రెడ్డి, డీబీటిఎస్ వెంకట్రావు మరియు గ్రామంలోని పలువురు రైతులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *