అర్జీలను సత్వరం పరిష్కారించేలా ప్రత్యేక దృష్టి సారించాలి – జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)వేదికలో అందిన అర్జీలను సత్వరం పరిష్కారించేలా ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్ రెడ్డి, పార్ధసారధి, శ్రీమతి మాధురిలతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ, మాట్లాడుతూ ..అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించేలా సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. అర్జీదారుని సంతృప్తే ధ్యేయంగా అర్జీల పరిష్కారతీరు వుండాలని స్పష్టం చేశారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీలు రీ-ఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలన్నారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖీగా మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తిస్ధాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *