జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం కమర్షియల్ ట్యాక్స్ శాఖ మరియు ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధ్యక్షత వహించడం జరిగింది ఈ సమావేశంలో కమర్షియల్ ట్యాక్స్ శాఖ మరియు ఇతర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంపొందించేందుకు చర్యల పై చర్చించారు.
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా క్రింది అంశాలపై జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు… అందులో..
పన్ను పరిధిని విస్తరించడం: రూ.40 లక్షల టర్నోవర్ (వస్తువుల విషయంలో) మరియు రూ.20 లక్షల టర్నోవర్ (సేవల విషయంలో) దాటిన వ్యాపార సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. అటువంటి వ్యాపార సంస్థల సమాచారం కమర్షియల్ ట్యాక్స్ శాఖకు అందించాల్సిందిగా సూచించారు.
– పాత బకాయిల వసూలు: మునిసిపల్ కమిషనర్లు, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్, రెవెన్యూ అధికారులు, పన్ను బకాయిదారుల ఆస్తుల వివరాలను కమర్షియల్ ట్యాక్స్ శాఖకు అందించాలని సూచించారు. అలాగే, పన్ను ఎగవేతదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
– టి. డి ఎస్ మినహాయింపు మరియు ప్రభుత్వానికి చెల్లింపు:
రూ.2.5 లక్షల విలువను మించిన సరఫరా ఒప్పందాలపై టి. డి. ఎస్ మినహాయించి జి ఎస్ టి ఆర్ -7 ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిందిగా సూచించారు. జిల్లా లోని డ్రాయింగ్ లను డిస్బర్స్మెంట్ అధికారులతో టి. డి. ఎస్ పై అవగాహన సమావేశం నిర్వహించాలని సూచించారు.
– పన్ను లేకుండా సరుకుల రవాణా:
– గ్రానైట్ మరియు ఇతర సరుకుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రవాణా మరియు మైనింగ్ శాఖలు కమర్షియల్ ట్యాక్స్ శాఖతో సమన్వయం కలిగి ఉండాలని సూచించారు.
– డీజిల్ స్థానికంగా కొనుగోలు: కాంట్రాక్టర్లు డీజిల్ ను స్థానికంగా ప్రామాణిక షెడ్యూల్ రేట్ల ప్రకారం కొనుగోలు చేయాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పన్ను ఆదాయం కాపాడబడుతుందని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని కోరారు.
– ప్రొఫెషన్ ట్యాక్స్: రూ. 10 లక్షల వార్షిక టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలు, డాక్టర్లు, ఆర్కిటెక్టులు వంటి ప్రొఫెషనల్స్ ప్రొఫెషన్ ట్యాక్స్ చెల్లించాల్సిందిగా సూచించారు. అలాగే, నెలకు రూ. 15,000/- కంటే ఎక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులు కూడా ప్రొఫెషన్ ట్యాక్స్ చెల్లించాల్సిందిగా పేర్కొన్నారు. వ్యాపార సంస్థల సమాచారం కమర్షియల్ ట్యాక్స్ శాఖకు అందించాల్సిందిగా సూచించారు.
ఈ సమావేశంలో వై. కిరణ్ కుమార్, జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, ఎం. సత్య ప్రకాష్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ మరియు ఓంగోలు-I, ఓంగోలు-11 సర్కిళ్ల అసిస్టెంట్ కమిషనర్లు, డిడి మైన్స్ రాజశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, డిటిసి సుశీల, సి పి డి సి ఎల్, ఇరిగేషన్ శాఖల ఎస్ ఈ లు వెంకటేశ్వర రావు, వరలక్ష్మి, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి పద్మశ్రీ, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాస్ రావు తదితరులు హాజరయ్యారు.



