ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సోమవారం ప్రారంభమైన అన్ని జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, ఇతర అధికారులు ప్రకాశం భవనము వీడియో కాన్ఫరెన్స్ హాలులో వీక్షించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కాన్ఫరెన్స్లో శాఖల వారీగా వివిధ అంశాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక టైం టేబుల్ ను కూడా రాష్ట్ర అధికారులు రూపొందించారు. ఆయా వివరాలను జిల్లా స్థాయి అధికారులకు తెలియజేసి, ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.