ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కీలక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

ప్రకాశం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ పరిసర ప్రాంతాలు మరియు వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మద్దిపాడు ఎస్‌ఐ వెంకట సూర్య, ఆర్‌ఎస్‌ఐ తిరుపతిస్వామి,డాగ్ స్క్వాడ్ (పేలుడు పదార్థాలు గుర్తించి మాగ్గీ జగిలాం) మరియు బాంబ్ డిస్పోజల్ టీం సభ్యులు మరియు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గుండ్లకమ్మ రిజర్వాయర్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రవేశ మార్గాలు, డ్యామ్ పైభాగం, ఉద్యానవనం ప్రదేశాలను డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలను గుర్తించే ప్రత్యేక జగిలాంతో సహా బాంబ్ డిస్పోజల్ టీమ్ ప్రతి మూలను పరిశీలించారు. ప్రజలు తరచూ సందర్శించే ప్రదేశమై ఉండటంతో ముందస్తు చర్యలు తీసుకున్నారు. అలాగే, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో వచ్చే వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు మరియు దేవస్థాన పరిసరాల్లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆలయ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు వరకు డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు.

పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసులు కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని లేదా డయల్ 112 కాల్ చేయాలని సూచించారు.

జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు, నేర నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజల భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *