రాష్ట్రంలో సీజన్ సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగాఉండాలి -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ -కలెక్టర్లతో సీజనల్ వ్యాధులు, వరిధాన్యసేకరణ, ఎరువులసరఫరా, ప్రభుత్వ సేవలపై ప్రజా స్పందన తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ

రాష్ట్రంలో సీజన్ సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగాఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో సీజనల్ వ్యాధులు, వరిధాన్యసేకరణ, ఎరువులసరఫరా, ప్రభుత్వ సేవలపై ప్రజా స్పందన తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడు తూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజన్ వ్యాధులకు ప్రజలు గురికాకుండా పారిశుద్ధ్య కార్యక్రమా లుముమ్మరంగా చేపట్టాలని ఆయన చెప్పారు. జిల్లాల్లో పారిశుధ్యం తోపాటు సురక్షితమైన త్రాగు నీటిని ప్రజలకు సరఫరాచేయాలని ఆయన అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో వరి ధాన్య సేకరణ చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లకు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు, దేవాలయాల్లో ప్రజలకు అందుతున్న సేవలు, రేవిన్యూ శాఖలలో సేవల గురించి సర్వేలో ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేశారని ఆయన చెప్పారు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి చెందే విధంగా అధికారులు పనిచేయాలనిఆయన చెప్పారు. ప్రకాశం జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ పి.రాజబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, పౌర సరఫరాలశాఖ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, వ్యవసాయశాఖ జె.డి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *