21న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. రాజీయే రాజమార్గం – బాలానగర్ డివిజన్ ఏ సి ఐ పింగిలి నరేష్ రెడ్డి.


బేగంపేట డిసెంబర్ 19 (జే ఎస్ డి ఎం న్యూస్) :
జాతీయ మెగా లోక్ అదాలత్ లను సద్వినియోగం చేసుకోవాలని రాజీ మార్గమే రాజ మార్గం అని బాలానగర్ ఏసీపీ పింగిలి నరేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, ఇరువైపుల సమ్మతితో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం అందుబాటులో ఉందని తెలిపారు. రాజీ చేసుకునే అవకాశమున్న వివిధ రకాల కేసులు క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితం & కుటుంబ సమస్యలకు సంబంధించిన కేసులు, డ్రంకన్ డ్రైవ్, మోటారు వాహన చట్ట ఉల్లంఘనలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం తదితర కేసులు పరిష్కరించుకోవచ్చు అని వివరించారు. కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని అన్నారు. న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *