హైదరాబాద్ డిసెంబర్ 19 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 221 దరఖాస్తులు అందాయి. వాటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 85దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు సంబంధించి 20, ఇందిరమ్మ ఇండ్ల కోసం 75, దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 41 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లు దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.
చిన్నారెడ్డి కి వినతి పత్రం అందించిన నర్సింగ్ ఆఫీసర్లు..
2,322 నర్సింగ్ ఆఫీసర్స్ నియామకం కోసం షెడ్యూల్ ను ప్రకటించాలని కోరుతూ అభ్యర్థులు పెద్ద ఎత్తున సీఎం ప్రజావాణికి తరలి వచ్చారు. శుక్రవారం జరిగిన సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. సంబంధిత అధికారితో ఫోన్ లో చిన్నారెడ్డి మాట్లాడగా త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని ఆ అధికారి జవాబు ఇచ్చారు.
