ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ పోర్ట్ శాఖ టెక్నికల్ అధికారుల సంఘం జోన్ 3 ఎన్నికల్లో ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఒంగోలు పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి మంజేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ అనంతరం ఒప్పో పోస్ట్ కు ఒక్క అభ్యర్థి నామినేషన్ దాఖలు పల్చగా ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయని, 9 పోస్టులకు 9 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో జోన్ 3 పరిధిలో అధ్యక్షులుగా గుంటూరు జిల్లా మంగళగిరి కి చెందిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా డిటిసి ఆఫీస్ ఒంగోలు కి చెందిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కే జయప్రకాష్, ట్రెజరర్ గా నెల్లూరు జిల్లా కావలికి చెందిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కే కరుణాకరన్, డిస్టిక్ రిప్రెజెన్టివ్గా గుంటూరు జిల్లాకు చెందిన జి అమృత రాణి, పల్నాడు జిల్లాకు చెందిన సిహెచ్ మనీషా, బాపట్ల జిల్లాకు చెందిన కె రవి నాయక్, ప్రకాశం జిల్లా కు చెందిన బి భాను ప్రకాష్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన జి మల్లికార్జున్ రెడ్డి, మార్కాపురం జిల్లాకు చెందిన కే ఎల్ రావు నువ్వు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు సహాయ ఎన్నికల అధికారిగా ఒంగోలు తాలూకా కార్యదర్శి మగ్దూం షరీఫ్, పరిశీలియకులుగా జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బి కృష్ణ కిషోర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీని పలువురు అభినందించారు .
