సికింద్రాబాద్, ఏప్రిల్ 01,
( జే ఎస్ డి ఎం న్యూస్):
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఘనంగా రంజాన్ ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీ మినిస్ట్రీయల్ డిపార్ట్మెంట్ కు చెందిన ముస్లిం సోదరులకు అధికారులు, సిబ్బంది రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ శోభ, ఏడీ ఫ్లోరెన్స్ మెర్లిన్, ఆర్ ఎం ఓ- 1 డాక్టర్ శేషాద్రి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, ఆర్ ఎం ఓ నాజిం, గాంధీ టీఎన్జీవో ప్రెసిడెంట్ గంటా ప్రభాకర్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ లు ఎంఏ ఖలీమ్, గోపాల్, యూసుఫ్, జనరల్ సెక్రెటరీ ప్రసన్న ఆనంద్, ట్రెజరర్ శ్రవణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ రహీం , హనీఫ్ ఉద్దీన్, జాయింట్ సెక్రెటరీ మీర్ మక్సుద్ అలీ, జనార్ధన్, విశ్వనాథ్, సరళ, అష్రఫ్ నజీరా, సత్యనారాయణ పాల్గొన్నారు.
