దర్శి నియోజక వర్గం లోని ముండ్లమూరు, తాళ్ళూరు మండలాల లో స్వల్ప భూకంపం రావడం ప్రజలు బెంబేలెత్తారు . ముండ్లమూరు మండలం లో ని ముండ్లమూరు, పోలవరం, శంకరాపురం, పూరిమిట్ల,భీమవరం, మారెళ్ళ, వేంపాడులలో , తాళ్లూరు మండలం విఠలాపురం పంచాయితీ పరిధిలో రెండుసార్లు భూమి కనిపించడంతో ఆయా గ్రామాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు… ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో మండల ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పెంచుకున్నారు. సిరియాలో భూ కంపం వలన ప్రజలు విల విల లాడుతున్న సమయంలో ఇటువంటి ప్రకంపనలు రావటంతో ప్రజలలో తీవ్ర చర్చాంశనీమైనది.
ముండ్లమూరు, తాళ్ళూరు మండలాల లో భూకంపం…. భయాందోలనలో మండల ప్రజలు…
14
Feb