విఠలాపురం తాత్కాలిక సర్పంచిగా షేక్ మహబూబ్ బి సోమవారం బాధ్యతలు చేపట్టారు. సర్పంచి మారం ఇంద్రసేనా రెడ్డి పిబ్రవరి 3న మూడు నెలల పాటు సర్పంచి పదవి నుండి 3నెలల పాటు సస్పెండ్ కావటంతో ఆయన స్థానంలో ఉప సర్పంచిగా ఉన్న ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఈఓఆర్డీ ఎన్ యూ ప్రసన్నకుమార్, గ్రామ కార్యదర్శి నూరుల్లాను మహబూబ్బి బాధ్యతలు అప్పగించి రికార్డులలో సంతకాలు చేయించారు. కో ఆప్షన్ మెంబర్ కరిముల్లా, మల్కాపురం సర్పంచి వలి, షేక్ బుడే, ముండ్లమూరు మస్తాన్, బుడే సాహేబ్, మస్తాన్, కాశిం వలి, గోళ్లపాటి చిన ఏసు తదితరులు పాల్గొన్నారు.
విఠలాపురం తాత్కాలిక సర్పంచిగా మహాబూబ్ బి బాధ్యతలు స్వీకరణ
20
Feb