మహిళలే సమాజ ప్రగతికి వెలుగులు అని వక్తలు అన్నారు. తాళ్లూరు, తూర్పుగంగవరం గ్రామాలలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పు గంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ బి. రత్నం ఆధ్వర్యంలో వైద్యురాలు మౌనిత ఇతర సిబ్బందిని ఘనంగా సన్మానించారు. తాళ్లూరు కస్తూరిబా పాఠశాలలో వ్యవసాయాధికారి ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఓ సుజిత పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎంఎంఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహణ
తాళ్లూరు మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను బుధవారం వైఎస్సార్ క్రాంతి పథకం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఎపీఎం దేవరాజ్ అధ్యక్షతన సభను నిర్వహించారు. మన్నేపల్లి మాజీ సొసైటీ డైరెక్టర్ ఐ. ఆదిలక్షమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత, ఎంఎంఎస్ అధ్యక్షురాలు
విజయలక్ష్మిలను ఘనంగా సన్మానించారు.

