జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న గుంటిగంగ సన్నిధిలో ఆదివారం గుంటి గంగమ్మ తల్లిని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులుగంగమ్మతల్లి పొంగళ్లు పెట్టి చల్లగా చూడమని వేడుకున్నారు. తాళ్లూరు ప్రాంతంతో పాటు పలుగ్రామాలకు చెందిన మొక్కులు తీర్చుకున్నారు. గంగమ్మ తల్లిని భక్తులు దర్శించుకుని పూజలుచేయగా, పలువురు భక్తులు అమ్మవారికి వాహనదారులు వాహన పూజలు చేయించారు. కొందరు భక్తులు గంగమ్మతల్లికి రూ13,8 65లు విరాళాలు అందజేశారు. గుంటిగంగమ్మ తల్లికి రూ18,965 లు ఆధాయం సమ కూరింది. ఆలయ పూజారులు ఆలయ పూజారులు ప్రకాష్ రావు, కామేశ్వరశర్మ, విజయ లక్ష్మిలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో ఏభాస్కర్రెడ్డి, దేవస్థాన్ ఆర్.ఏ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
