దర్శి ఎస్సీ కాలనీలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని …ఇంటింటికి అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎస్సీ కాలనీలో ఉన్న సమస్యలను స్వీకరించి పరిష్కారానికి మార్గం చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకముందు ఏ ప్రభుత్వం చేయలేదని మరలా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికే పట్టం కట్టాలని జగన్మోహన్ రెడ్డి ని సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, కట్టేకోట హరీష్, జెసిఎస్ పట్టణ అధ్యక్షుడు ఎదురు కోటిరెడ్డి, సొసైటీ చైర్మన్ వేమిరెడ్డి చెన్నారెడ్డి, జేసీఎస్ రూరల్ అధ్యక్షుడు బత్తినేని వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు విసిరెడ్డి, మేడం మోహన్ రెడ్డి, నాయకులు కొడవటి జాన్, సామ్యేల్, సుశీల ప్రతాప్ ,గోపు యర్రయ్య, అంకాల శ్రీనివాస్ , తుళ్లూరి బాబురావు, జగన్నాధమోహన్ బాబు, ప్రజలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
*అనారోగ్యంతో బాధపడుతున్నవ్యక్తికి డాక్టర్ మద్దిశెట్టి ఆర్ధికసాయం*
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆర్ధిక సాయం అందించారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి గురించి తెలుసుకుని ఆర్థికసాయంగా నగదును అందించారు.




