తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో సోమవారం విజయ దశమి పండుగను జరుపుకున్నాయి. అమ్మవారిని ఘనంగా పూజించి గ్రామోత్సవాలు నిర్వహించారు. బొద్దికూరపాడులో శ్రీ గంగా పార్వతి వర్దిని సమేత సోమేశ్వర స్వామి దేవాలయంలో, మాధవస్వామి వారిని సుందరంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. దేవాతా మూర్తుల విగ్రహాలను గ్రామాలలోని వీధులలో మేళ తాళాలతో బాణ సంచా కాలుస్తూ ఊరేగింపుగా వారు వేట కార్యక్రమాన్ని నిర్వహించారు. జమ్మిచెట్టు పూజ నిర్వహించారు. మాధవస్వామి ఆలయంలో ఆచారం ప్రకారం మున్సిఫ్ పెద సుబ్బా రెడ్డి వారసులు పులి సుబ్బా రెడ్డి దంపతులు, తల్లి వరమ్మ నేతృత్వంలో ఆలయ కమిటీ చైర్మన్ పులి అంజి రెడ్డి, ఆలయ కమిటీసభ్యులు సగిలి పెద నాగేశ్వరరావు, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ కొప్పుల బాల కోటయ్య, గ్రామ పెద్దలు ఎస్ యోగి రెడ్డి, బాల కోటి రెడ్డి, పులి చిన ఓబులు రెడ్డి, గోపాల్ రెడ్డి, సన్నపు రెడ్డి అంజి రెడ్డి పలువురు గ్రామపెద్దలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.



