తాళ్లూరు మండంలోని కొత్తపాలెం గ్రామంలో శనివారం రాత్రి -చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కోట సుబ్బారెడ్డి ఇంట్లోకి దుండగులు ప్రవే- శించి బీరువా తాళాలు పగులకొట్టి అందులోని సుమారు ఏడు సవర్ల బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ మేరకు యజమాని కోట సుబ్బారెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వైవీ రమణయ్య గ్రామానికి వెళ్లి దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. క్లూస్ టీం , ఫింగర్ప్రింట్ టీంలు రంగంలోకి దిగి వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


