శాంతి భద్రతల విషయంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మంగళవారం
కంటోన్మెంట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏటువంటి పక్షపాతం లేకుండా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని పోలీస్ స్టేషన్ వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలని, కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో శాంతి భద్రతలను సక్రమంగా కాపాడాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బేగంపేట ఏసిపి గోపాల కృష్ణమూర్తి ,సర్కిల్ ఇన్స్పెక్టర్ రామయ్య , కార్ఖానా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , బోయిన్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి , తిరుమలగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.

