గవరర్నర్ ను కలిసిన సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్లు యాదవ్….ప్రత్యేక కమిషన్‌తో కులగణన…బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం -స్థానిక సంస్థల ఎన్నికల ముందు అమలు – తెలంగాణ రాష్ట్రం తరహాలో అమలు -గవర్నరుకు రాజకీయ, బీసీ సంఘాల ప్రతినిధుల బృందం విజ్ఞప్తి

స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు దామాషా రిజర్వేషన్ల అమలుకు ముందస్తుగా విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రత్యేక కమిషన్‌ ద్వారా కుల గణన నిర్వహించాలని రాష్ట్ర గవర్నరు అబ్దుల్‌ నజీర్‌కు విజ్ఞప్తి చేసినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు
పాశం వెంకటేశ్వర్లు యాదవ్ వెల్లడించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల తరహాగా రాష్ట్రంలోను జనగణనలో కులగణన చేపట్టాలని, ఆ దిశగా స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేలా కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరామన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నరు అబ్దుల్‌ నజీర్‌కు రామకృష్ణ నేతృత్వంలో
సమాజ్ వాది పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు
వంగేపురం కార్తీక్ రాజు
ఆర్జెడి రాష్ట్ర నాయకులు, శ్రీనివాస్, వాసు సత్యనారాయణ మూర్తి,
పార్టీ మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, బీసీ సంఘాల నేతలు డాక్టర్‌ అలా వెంకటేశ్వర్లు, సమాజ్‌వాద్‌ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, ఆర్జేడీ నాయకులు ఆర్‌ఎస్‌ యాదవ్‌ తదితరులతో కూడిన బృందం వినతిపత్రం అందజేసింది. విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యానికిగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి బీసీలకు దామాషా రిజర్వేషన్లను అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ కీలకమైన చర్యలు అమలయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాలని అభ్యర్థించింది. అనంతరం రాజ్‌భవన్‌ ఎదుట వివిధ రాజకీయ, బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి విలేకరులతో రామకృష్ణ మాట్లాడారు. వెనుకబడిన తరగతుల సామాజిక-ఆర్థిక పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేయడానికి, ఖచ్చితమైన ఆధారాల ఆధారిత విధాన ప్రణాళిక కోసం ఒక ప్రత్యేక కమిషన్‌ ద్వారా కుల గణన నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించామని వివరించారు. బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను అమలు చేయడం చాలా అవసరమని, అంకితమైన బీసీ కమిషన్‌ ద్వారా కుల గణన నిర్వహించిన తర్వాత, వాస్తవ వెనుకబడిన తరగతుల జనాభాను ప్రతిబింబించే ఫలితాల ఆధారంగా, విద్య, ఉపాధి మరియు స్థానిక సంస్థలలో బీసీలకు దామాషా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉపాధిలలో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికిగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నమూనాను గవర్నరు దృష్టికి తీసుకెళ్లామన్నారు. బీసీ రిజర్వేషన్‌ బిల్లు గవర్నర్‌, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నప్పటికీ, రాజ్యాంగ ఆమోదాలు ఎదురుచూస్తున్నప్పటికీ, అడ్డంకులు కొనసాగుతున్నప్పటికీ, బీసీలను రక్షించడానికి రాష్ట్ర స్థాయిలో నిర్ణయాత్మక కార్యనిర్వాహక చర్య సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా ప్రదర్శించిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థల ప్రస్తుత పదవీకాలం ఏప్రిల్‌ 2025 వరకు పొడిగించారని, రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా, ప్రభుత్వం షెడ్యూల్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తోందన్నారు. 2026 జనవరిలో ఎన్నికలు నిర్వహించాలని, ఈ సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు, పెండింగ్‌లో ఉన్న అన్ని అడ్డంకులను మొదటి కుల జనాభా గణన ద్వారా పరిష్కరించాలని, దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరగా, ఆయా అంశాలపై గవర్నరు సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర కుల గణన కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరామన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *