ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా ఉమన్ వింగ్ చైర్ పర్సన్ నర్రా విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీ సిహెచ్ శ్రీదేవి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజాబాబును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మహిళా ఉద్యోగుల సమస్యల గురించి వారికి వివరించారు. మహిళల సమస్యలపై తనను ఎప్పుడైనా కలవచ్చని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. కలెక్టర్ ను కలిసిన వారిలో సభ్యులు ఏ సుమలత, ఏ తిరుపతమ్మ, జి అనంతలక్ష్మి, షేక్ హసీనా, గాయత్రి తో పాటు కలెక్టరేట్ యూనిట్ సభ్యులు కలెక్టర్ ని కలిసిన వారిలో ఉన్నారు.
