జిల్లాకు సంబంధించి ఈవిఎంలను భధ్రపరచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భధ్రత ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పి. రారాజాబాబసంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎన్నికల కమీషన్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో గల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఇవిఎం) గోదాములను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి గోదాములకు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ వెంట విజయవాడ ఎలెక్షన్ సెల్ డిప్యూటీ సిఈఓ ఎస్. ఆంజనేయులు, ఒంగోలు డిఆర్ఓ చిన ఓబులేసు, కలెక్టరేట్ సూపరింటిండెంట్ శ్రీనివాస రావు, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
