బక్రీద్ పండుగ ప్రశాంత నిర్వహణపై జూబ్లీహిల్స్ జోన్ సమన్వయ సమావేశం.

హైదరాబాద్ ఏప్రిల్ 22,
(జే ఎస్ డి ఎం న్యూస్):
బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేలా చూసేందుకు బుధవారం మధురానగర్ కమ్యూనిటీ హాల్‌లో ఉన్నత స్థాయి అంతర్-శాఖల సమన్వయ సమావేశం జరిగింది. డిసిపి ఎ. రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి కె. శ్రీకాంత్, జిహెచ్ఎంసి డెప్యూటీ కమిషనర్ ఎ. సురేష్, ఎస్.ఆర్. నగర్ ఏసిపి రాఘవేంద్ర, బంజారాహిల్స్ ఏసిపి వెంకటరెడ్డి, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాచకొండ రెడ్డి, వెటర్నరీ అధికారులు డాక్టర్ దీపాంకర్, జమీల్, సనత్ నగర్ ఏడిఈ వంశీకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎం వి ఐ), అర్బన్ బయో డైవర్సిటీ మేనేజర్ శ్రీనివాస్ మరియు ఇతర అధికారులు ప్రసంగించారు.ఈ సమావేశంలో పోలీస్, జిహెచ్ఎంసి, పశుసంవర్ధక, వెటర్నరీ మరియు రవాణా శాఖల అధికారులతో పాటు పశువుల రవాణాదారులు, ఖురేషీ కమ్యూనిటీ సభ్యులు, బీఫ్ షాపుల యజమానులు కలిపి సుమారు 200 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసిపి రమణారెడ్డి మాట్లాడుతూశాఖల మధ్య సమన్వయం శాంతిభద్రతల పరిరక్షణ మరియు ఏర్పాట్ల నిర్వహణలో పోలీస్, జిహెచ్ఎంసి మరియు వెటర్నరీ శాఖల మధ్య పరిపూర్ణ సమన్వయం ఉండాలనినొక్కి చెప్పారు. చెక్ పోస్టుల పర్యవేక్షణ పశువుల తరలింపునుపర్యవేక్షించడానికి మరియు చట్టపరమైన నిబంధనలు అమలు చేయడానికి చెక్ పోస్టులు మూడు షిఫ్టులలో నిరంతరం పనిచేయాలని ఆదేశించారు. చట్టపరమైన నిబంధనల అమలు: ఆవులు మరియు దూడల అక్రమ రవాణా, విక్రయం లేదా వధపై కఠిన నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. పశువులను రవాణా చేసే వారు ఖచ్చితంగా వెటర్నరీ డాక్టర్ల ధృవీకరణ పత్రం (సర్టిఫికెట్) మరియు అధికారిక రవాణా రసీదులను కలిగి ఉండాలన్నారు.
పండుగ సమయంలో పారిశుధ్య నిర్వహణ మరియు వ్యర్థాల తొలగింపు సక్రమంగా జరిగేలా చూడాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీ కలగకుండా పోలీస్ శాఖ తగిన చర్యలు చేపడుతుందని వివరించారు.జంతు సంక్షేమ నిబంధనలను పాటిస్తూ, మత సామరస్యాన్ని కాపాడటంలో పరిపాలనా యంత్రాంగానికి స్టేక్ హోల్డర్లందరూ సహకరించాలని కోరారు.
బక్రీద్ వేడుకలను శాంతియుతంగా మరియు చట్టబద్ధంగానిర్వహించేందుకు అన్ని శాఖలు మరియు కమ్యూనిటీ నాయకులు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *