తాళ్లూరు మండలంలోని
మాధవరం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మండల రైతు విభాగం జనరల్ సెక్ర టరీ మూల భాస్కర్ రెడ్డి సతీ మణి నాగేశ్వరమ్మ (36) శుక్రవారం రాత్రి గుండె పోటు తో మరణించారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో పార్టీ రాష్ట్ర మేధావుల సంఘ కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా సెక్రటరీ మారం ఇంద్రాసేనారెడ్డి, ముండ్లమూరు పార్టీ అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, మాజీ సర్పంచ్ లు కోట శివలక్ష్మి, వెంకట రామిరెడ్డి, నుసుం సుబ్బారెడ్డి, షేక్ వలి, గ్రామ పార్టీ అధ్యక్షుడు నుసుం రాజమో హన్ రెడ్డి , నాయకులు నారాయణ శెట్టయ్య, కొనికి గోవిందరాజు, ఐ.వి జయ, భాస్కర్ రెడ్డి, షేక్ లతీఫ్, ఉమామహేశ్వర్రెడ్డి ఉన్నారు.
