తూర్పు రాయలసీమ నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. తాళ్ళూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో MLA డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ ప్రతినిధులుగా… వై యస్ ఆర్ కాంగ్రేస్ పార్టీ బలపరిచిన తూర్పు రాయలసీమ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేయుచున్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, విద్యారంగంతో సహా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు . కార్యక్రమంలో మండల JCS కన్వీనర్ యాడిక. శ్రీనివాసరెడ్డి, గంగవరం వైస్ సర్పంచ్ యత్తపు.కాశిరెడ్డి, ప్రకాశంజిల్లా వైసీపీ యూత్ ప్రధానకార్యదర్శి భీమిరెడ్డి.నాగమల్లేశ్వరరెడ్డి, గ్రామ వైసీపీ కన్వీనర్ గువ్వల.తిరుపతిరెడ్డి, వైసీపీ నాయకులు తూము.రవికుమార్, యత్తపు. మధు, గుద్దేటి.రామిరెడ్డి మరియు MLC ఓటర్స్ యత్తపు.మాధవి, పుట్టా. శ్రీనివాసరావు, తిప్పిరెడ్డి.తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.

