ప్రభుత్వం 104 వాహనం ద్వారా గ్రామాలలోని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ల వద్ద ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ఉమ మహేశ్వరపురం గ్రామంలోని డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినికల్ వద్ద వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే మీ దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గాని, మీ గ్రామాల్లోని వైయస్సార్ హెల్త్ క్లినికల్ వద్ద గాని వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ శిబిరంలో 210 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 80 మందికి షుగర్ పరీక్షలు 88 మందికి బీ పి పరీక్షలు, జలుబు దగ్గు జ్వరాలు ఉన్నవారికి మందులు పంపిణీ చేశారు. సిహెచ్ఓ జయశ్రీ, డి ఈ ఓ వెంకట ప్రసాద్, ఆశాలు నర్మదా, పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.
104 వాహనం ద్వారా వైద్య పరీక్షలు
11
Mar