ప్రజల ఆరోగ్యానికి జగనన్న భరోసా – దొనకొండ మండలంలో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం – ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మ కంగా జగనన్న ఆరోగ్య సురక్ష చేపట్టారని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. దొనకొండ మండలంలోని మల్లంపేట గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. వైద్యాధికారికె.సునీత పర్యవేక్షణలో ప్రజలకు డాక్టర్లు వైద్య పరీ క్షలు చేశారు. తొలుత వైస్ ఎంపీపీ వడ్లమూడి వెంక టేశ్వర్లు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు మహిళలు స్వాగతం పలికారు. తహసీల్దార్ ఎం. సువర్ణ, ఎం పీడీఓవి. వసంతరావునాయక్, ఎంఈఓ ఎన్. సాం బశివరావు, జిల్లా యూత్ అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ మురికిపూడి సుధాకర్, వైస్ ఎంపీ పీలు వడ్లమూడి వెంకటేశ్వర్లు, మిట్టా కోటిరెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ గుంటు పోలయ్య, సర్పంచ్ పోలు కుమార్ తదితరులు పాల్గొన్నారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *