దర్శి పట్టణంలో వైఎ స్సార్ సీపీ నియోజక వర్గ కార్యాలయ భవన నిర్మాణానికి బుధ వారం భూమిపూజ చేశారు. పొదిలి పూజలకు హాజరైన వైఎస్సార్ సీపీ నాయకులు రోడ్డులోని గౌతమి కళాశాల పక్కన విశాలమైన స్థలంలో భూమి పూజను వేద మంత్రాల నడుమ పండితులు చేతుల మీదుగా ప్రత్యేక పూజలతో నిర్వహిం చారు. వైఎస్సార్ సీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, కౌన్సిలర్ మేడం మోహన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కేవీ రెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రగిరి గురవారెడ్డి, నాయకులు కర్ణా భాస్కర్ రెడ్డి, సందిరెడ్డి, నరేంద్రరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెన్నపూస బాపిరెడ్డి, మేడగం పుల్లారెడ్డి, కొల్లా ఉదయభాస్కర్, రహముల్లా, ఇరుగుల శ్రీనివాసరెడ్డి, ముప్పరాజు రవి, నాగూర్ వలి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, పుల్లారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఆవుల శివారెడ్డి, ఉడుముల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు
.

