ఎన్నికల కౌంటింగ్, అనంతరం గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేందుకు యత్నిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఎస్సై వై.వి.ర మణయ్య హెచ్చరించారు. పోలింగ్ సందర్భంగా కొర్రపాటి వారిపాలెం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగ టంతో ఉన్నతాధికారుల ఆదేశాను సారం ఆ గ్రామంలో పోలీసులు బుధవారం మార్చ్ ఫ్లాగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వైవి రమణయ్య మాట్లాడుతూ… ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినం దున గ్రామాల్లో శాంతికి విఘాతం కల్గించ వద్దన్నారు. గ్రామంలోని అన్ని వీధుల్లో ఎస్సై రమణయ్య సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై మోహన రావు, సిబ్బంది ఉన్నారు.
